దక్షిణాసియాలో ఇస్లాం వికాసం: చరిత్ర, మార్గాలు, ప్రభావం
దక్షిణాసియా అనగా నేడు భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు సమీప దేశాలు - కోట్లాది మంది ముస్లింలకు ఒక నిలయం. ఉదాహరణకు, పాకిస్తాన్ లో దాదాపు 240 మిలియన్ల మంది ముస్లింలు నివసిస్తున్నారు. అంతేగాక, భారతదేశంలో దాదాపు 200 మిలియన్లు, మరియు బంగ్లాదేశ్ లో దాదాపు 150 మిలియన్లు ఉన్నారు. ఇస్లాం దాదాపు 1,300 నుండి 1,400 సంవత్సరాల క్రితం ఇక్కడకు వచ్చి అనేక మార్గాల ద్వారా ఎక్కువగా అభివృద్ధి చెందింది. ఇస్లాం సైన్యాలతోనే కాకుండా వ్యాపారులు మరియు విజ్ఞానుల ద్వారా కూడా వచ్చింది. చరిత్రకారులు ఇస్లాం వ్యాప్తి గురించి ఇలా అన్నారు: 7వ శతాబ్దంలోనే, ముస్లింల విజయాలకు ముందే అరబ్ వ్యాపారులు భారతదేశ తీరాలను సందర్శించడం ప్రారంభించారు.అంతేగాకుండా ఇక్కడి ఇస్లాం సూఫీ సాధువుల కృషి, అలాగే అరబ్ నుండి ఎందురో రాజులూ ఈ దక్షిణాఏసియాలో వచ్చి పాలనా చేయడం ద్వారా ఇస్లాం మరింతా ఎక్కువగా విస్తరించింది. ఈ వ్యాసం ఇస్లాం మొదట దక్షిణాఏసియాకు ఎలా వచ్చింది, సూఫీ సాధువులు మరియు ముస్లిం పాలకులు దాని అభివృద్ధికి ఎలా సహాయపడ్డారు, మరియు ప్రజలు ఇస్లాం మతాన్ని ఎలా అంగీకరించారు మరియు వారి యొక్క సంస్కృతులను ఎలా కలిపారు లాంటి మొదలగు విషయాలనుఈ వ్యాసం వివరిస్తుంది.
ఇస్లాం యొక్క ప్రారంభం
చరిత్రకారుల ప్రకారం ఇస్లాం చాలా కాలం ముందే ఎక్కువగా శాంతియుత మార్గాల్లో దక్షిణాసియాలో వచ్చింది. ఎందుకంటే పెద్ద పెద్ద సైన్యాలు రాకముందే, అరబ్ మరియు పేర్షియన్ వ్యాపారులు దక్షిణాసియాలోని ఓడరేవుల మీద సముద్ర మార్గంలో ప్రయాణించారు. మొదటి అరబ్ ముస్లింలు 600ల చివరిలో భారతీయ తీరప్రాంతాల పట్టణాలలో నివసించడం ప్రారంభించారు.మరియు అంతేకాక వ్యాపారులు మలబార్ తీరం (కేరళ) మరియు గుజరాత్ వంటి ప్రదేశాలలో నెమ్మదిగా చిన్న సమాజాలను నిర్మించారు. వారు భారతదేశంలో మసీదులను నిర్మించారు. అంతేగాక భారతదేశంలోని మొట్టమొదటి మసీదును కేరళలోని కొడుంగల్లూరులో ఓ అరబ్ వ్యాపారి ద్వారా క్రీ.శ. 629లో నిర్మించబడింది. ఆ మసీదు పేరు చేరమాన్ జుమా మసీదు. మాలిక్ బిన్ దినార్ అనే ఒక అరబ్ వ్యాపారి మరియు అతని సహచరులు కూడా మరో మసీదు నిర్మించారు. ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ సంఘటన మొత్తం మన ప్రవక్త ముహమ్మద్ గారి జీవితకాలంలో జరిగింది, అయితే ఈ సంఘటన ద్వారా దక్షిణాసియాలో ముస్లింలు చాలా ముందుగానే భారతదేశానికి వచ్చారని నిరూపిస్తుంది.
తరువాత, ఇస్లాం నెమ్మదిగా సైనిక చర్యల ద్వారా కూడా వచ్చింది. క్రీ.శ. 712లో, ఉమయ్యద్ జనరల్ ఖలీఫా అయినా ముహమ్మద్ బిన్ ఖాసిం అనే ఒక పాలకుడు సింధ్ మరియు పంజాబ్ ప్రాంతాలను జయించాడు. ప్రస్తుతం ఆ ప్రదేశాలు పాకిస్తాన్లో ఉన్నాయి. అతను ఆ ఖండం లో ఉన్న స్థానిక రాజును ఓడించి అక్కడ ముస్లిం పాలనను ప్రారంభించాడు. అయితే చాలామంది ప్రజలు ఇది దక్షిణాసియాలో ఇస్లాం పరిపాలన ప్రారంభం అని భావించారు. కానీ అప్పుడు కూడా ముహమ్మద్ బిన్ ఖాసిం ముందు స్థానిక రాజులను అధికారంలో ఉండనిచ్చాడే తప్ప, వారి రాజ ప్రజలను ముస్లింలుగా మార్చమని ఎటువంటి బలవంతం చేయలేదు. వాణిజ్యం మరియు రోజువారీ జీవితం ఒకే విధంగా కొనసాగేవి. అలాగే ఆ తరువాత, కొన్ని వందల సంవత్సరాలలో మరిన్ని సైన్యాలు ఈ దక్షిణాసియాలో వచ్చాయి. క్రీ.శ. 1000 లో, టర్కీ మరియు మధ్యాసియా నుండి ఘజ్ని మహమూద్ మరియు ముహమ్మద్ ఘోరి వంటి పెద్ద పెద్ద సైన్యాలు ఉత్తర భారతదేశంపై దాడి చేశాయి. వారు అక్కడి రాజులను ఓడించి, ఆ ప్రాంతంలో కొత్త రాజ్యాలను ప్రారంభించారు. 1206 AD నాటికి, ముహమ్మద్ ఘోరీ యొక్క సైన్యాధిపతి కుతుబ్ అల్-దిన్ ఐబక్ ఢిల్లీ సల్తనతును ప్రారంభించి ఢిల్లీకి మొదటి సుల్తాన్ అయ్యాడు.
అయితే ఈ దక్షిణాసియాలో ఇస్లాం యొక్క వ్యాప్తి ఎటువంటి బలవంతం లేకుండా, సైన్యాలు యుద్ధాలు చేసినప్పటికీ, ఇస్లాం సాధారణ ప్రజలలో నెమ్మదిగా వ్యాపించింది, ఇది ఎక్కువగా వ్యాపారం, రోజూ జీవితం మరియు ఆధ్యాత్మిక గురుల ద్వారా విస్తరించింది.
దక్షిణాసియాలో ఇస్లాం వ్యాప్తి, సూఫీ సాధువుల పాత్ర
దక్షిణాసియాలో ఇస్లాం వ్యాప్తి చెందడంలో సూఫీ సాధువుల ఒక గొప్ప కృషి ఉంది. అది తెలియాలంటే ముందుగా మనకు సూఫీల గురించి తెలియాలి. సూఫీ ఒక అరబీ పదం. సూఫీ అంటే ప్రేమ, భక్తి మరియు సాదరంగా జీవించువారు. అంతేగాక సూఫీలు అల్లాహ్ తో వ్యక్తిగత సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటారు. అంతేగాక చాలా మంది సూఫీ ప్రజలు పర్షియా (పర్షియా ప్రస్తుత ఇరాన్ లో ఉన్నది) మరియు మధ్యాసియా నుండి వచ్చారు. వారు దక్షిణాసియా మొత్తం ప్రయాణించి ప్రజలకు హితం బోధించడానికి మరియు వారికి ఇస్లాం యొక్క పాఠాలను నేర్పడానికి ప్రయత్నించారు.
దక్షిణాసియాలోని అత్యంత ప్రసిద్ధగాంచిన సూఫీల ప్రస్తావన:
మొట్ట మొదటిగా ఖాజా మొయీనుద్దీన్ (అజ్మీర్): ఆయనని గరీబ్ నవాజ్ అని కూడా పిలుస్తారు మరియు ఆ పేరు యొక్క అర్థం పేదల సహాయకుడ. అయన 12వ శతాబ్దానికి చెందిన ఒక సూఫీ సాధువు. అంతేగాక ఆయన భారతదేశంలో చిష్టి సూఫీ క్రమాన్ని ప్రారంభించారు. ఇంకా అయన మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రేమ, దయ ,మరియు ఇతరులకు సహాయం చేసేవారు,
అంతేగాక అయన 1141CE లో సిస్తాన్ అనే ఒక ప్రాంతంలో ఆయన జన్మించారు. సిస్తాన్ ఇప్పుడు ఇరాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్ యొక్క భాగం, అయితే అయన అంతదూరం నుంచి మన భారతదేశంలోకి ప్రయాణం చేసి రాజస్థాన్ లోని అజ్మీర్ లో స్థిరపడి ఏమాత్రం బలవంతం లేకుండా తమ యొక్క మంచి చర్యల ద్వారా శాంతియుత మార్గంలో ఇస్లాంను వ్యాప్తి చేశారు.
నిజాముద్దీన్ ఔలియా (ఢిల్లీ) : అయన ఉత్తరప్రదేశ్లోని బదాయున్ అనే ఒక గ్రామంలో1238లో జన్మించారు మరియు ఆ తరువాత అయన ఢిల్లీకి వెళ్లారు, మరియు అక్కడ ఆయన చిష్టి క్రమంలో అత్యంత ప్రసిద్ధగాంచిన సూఫీ సాధువులలో ఒకరిగా మారారు. అంతేగాక ఆయన బాబా ఫరీద్ యొక్క ఆధ్యాత్మిక వారసుడు. పేదలకు సేవ చేయడానికి మరియు ప్రేమ, శాంతి మరియు ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేయడానికి తన జీవితాన్నే అంకితం చేసిన గొప్ప మనిషి ఆయన. ఇంకా తమ హితబోధనల ద్వారా మరియు ఆదర్శాల ద్వారా, భారతదేశంలో సూఫీ క్రమాన్ని ప్రోత్సహించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు.
షాహ్ జలాల్ (సైల్హేట్,బెంగాల్) : ఆయన జననం 1320లో టర్కీలో అయింది. అయన ఒక ప్రముఖ సూఫీ సాధువు. అయన ఇస్లాం ను వ్యాప్తి చేయడానికి టర్కీ నుంచి సిల్హెట్ (ఇప్పుడు బంగ్లాదేశ్ యొక్క భాగం)లో వచ్చి స్థిరపడ్డారు. ప్రేమ, కరుణ మరియు అల్లాహ్ పట్ల భక్తి అనే బోధనల ద్వారా బెంగాల్లో ఇస్లాంను వ్యాప్తి చేసినందుకు ఆయన చాలా విస్తృతంగా గుర్తింపు పొందారు. అంతేగాక అయన ఈ లోకంలో దీర్ఘ ప్రయాణాలు చేశారు. బెంగాలులో ఆయన ఆధ్యాత్మిక నాయకుడిగా మారి, ప్రజలను భక్తి మార్గంలో నడిపించారు. షాహ్ జలాల్ పేదలకు ఎక్కువగా సహాయం చేసే వారు మరియు ప్రజలకు అల్లాహ్ పై భక్తి కలిగించేవారు. చివరికి షా జలాల్ 1394లో బెంగాల్లోని సిల్హెట్లో మరణించారు.