రంజాన్: ఖురాన్ మాసం (రెండవ భాగం)
ఖురాన్ను కంఠస్తం చేస్తున్నవారు లేదా చేసిన వారు వాళ్లకి గుర్తుందని వేగంగా చదవవచ్చు కాయాన్ని వాళ్ళు చెదివేటప్పుడు తజ్వీద్ యొక్క నియమాలను పాటిస్తూ పారాయణం చేయాలి.
వాళ్ళు కూడా తమ సమయాన్ని రమదాన్లో కొంత భాగాన్ని ప్రతిబింబంతో పఠించడానికి కేటాయించాలి, ముఖ్యంగా ఖియామ్ ప్రార్థనల సమయంలో.
అరబిక్ భాష మరియు ఖురాన్ యొక్క అర్థాలను అర్థం చేసుకోని వారికి, పఠించేటప్పుడు ఏకకాలంలో ప్రతిబింబించడం కష్టం కావచ్చు. ఏదేమైనా, వారు ఇప్పటికీ తర్తీల్ మరియు మరియు తజ్వీద్ యొక్క నియమాలను పాటిస్తూనే పఠించాలి. అంతేకాకుండా, వారు ఖురాన్ యొక్క భావాలను నేర్చుకోవడానికి, అనువాదాన్ని చదవడానికి మరియు వారి పరిమితుల్లో ప్రతిబింబించడానికి కూడా కొంచం సమయాన్ని కేటాయించాలి.
మనస్సును మరియు ఆత్మను పోషించే, శరీరాన్ని రక్షించే అల్లాహ్ గ్రంథంలో నిరంతరం నిమగ్నమై ఉండటం కంటే మరొక విజయానికి హామీ ఇచ్చే దేనినీ నేను చూడలేదు".
నెమ్మదిగా పారాయణం చేయండి
మనం ఖురాన్ను తజ్వీద్ మరియు తర్తీలతో పఠించాలి. తర్తీల్ అంటే నెమ్మదిగా మరియు ప్రశాంతంగా పఠించడం, ప్రతి పదాన్ని విభిన్నంగా చేయడం మరియు పరిమితులను మించకుండా చేయడం. ఇలా పఠించడం వల్ల నాలుక, గుండె మరియు మిగిలిన శరీరం ఒకదానితో ఒకటి సంపూర్ణ సామరస్యంతో ఉండేలా చేస్తుంది.
కొన్నిసార్లు మేము చాలా వేగంగా పఠిస్తాము, కేవలం ఒక సూరహ్ లేదా జుజ్ ముగింపుకు చేరుకోవడానికి. అదేవిధంగా, మనం తరావీహ్ ప్రార్థనలలో 'సూపర్ హై స్పీడ్' ను చూడవచ్చు. అయితే, ఇది సున్నతుకు విరుద్ధమైనది మరియు దీని నుండి మేము ఖురాన్ యొక్క లక్ష్యాలను సాధించలేము. ఖురాన్ సందేశాన్ని గ్రహించడానికి మరియు అల్లాహ్ మనకు ఏమి చెబుతున్నాడో ఆలోచించడానికి మనం ఖురాన్ని నెమ్మదిగా పఠించడం చాలా ముఖ్యం.
ఖురాన్ ద్వారా మన ఈమానును బలోపేతం చేయాలనుకుంటే కొన్ని ఆయత్లను పునరావృతం చేయడం చాలా ముఖ్యం. అయితే, ఒక సూరహ్, జుజ్ లేదా మొత్తం ఖురాన్ ముగింపుకు చేరుకోవడమే మన లక్ష్యం అయితే ఇది అసాధ్యం.
ఒక వ్యక్తి అబ్దుల్లా బిన్ మసూద్ వద్దకు వచ్చి, "నేను అన్నిముఫస్సల్ సూరాలను ఒకే రకాతులో పఠిస్తాను" అని అన్నారు. దీనిపై అబ్దుల్లా రదియల్లాహు అన్హు ఇలా అన్నారు, "(మీరు అలా పఠిస్తారా?) పారాయణం కవిత్వం లాగ హడావిడిగా పఠిస్తావా?
దీని గురించి ఖురాన్ చదివే వాళ్ళు అన్నారు, "ఇలా చదివే వాళ్ళ పారాయణం కేవలం కాలర్ కింద ఉన్న గొంతు వారికే వెళ్తుంది అన్నారు. అనగా మన పారాయణం మన గుండెలోకి ప్రవేశించి దానిలోనే లోతుగా పట్టిపోయినప్పుడే ఆ పారాయణం యొక్క ప్రయోజనం మనకు కలుగుతుంది.
మధురమైన పారాయణం అనగా కేవలం ఖురాన్ పారాయణం మంచిగా అనిపించేలా చదవడం మాత్రమే కాదు. తమ పూర్తి దృష్టితో పారాయణం చేయడం. ఇలాంటి పారాయణం అనివార్యంగా మన హృదయాన్ని తాకుతుంది. దీనివల్ల ఇది మనకు తఖ్వా (అల్లహ్తో భయాన్ని) ను మరియు శాంతిని అందిస్తుంది. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రస్తావించారు: "ఖురాన్ ను ఉత్తమమైన స్వరంతో పఠించేవారిలో, మీరు అతని పారాయణం విన్నప్పుడు, అతను అల్లాహ్కు భయపడుతున్నాడని మీరు స్పర్శిస్తారు". (ఇబ్న్ మాజా)
ఖురాన్ పఠించేటప్పుడు, మనం ఏడవడానికి ప్రయత్నించాలి, ఎందుకంటే అది ముందుకాలంనాటి పుణ్య ప్రజల ఆచారం కాబట్టి. దీని గురించి అల్లాహ్ తఆలా ఖురాన్లో ఇలా ప్రకటిస్తున్నారు
إِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُ الرَّحْمَـٰنِ خَرُّوا سُجَّدًا وَبُكِيًّا ۩ ٥٨
“ఒకవేళ వారికి కరుణామయుని సూచనలు (ఆయాత్) చదివి వినిపించినప్పుడు, వారు విలపిస్తూ సాష్టాంగం (సజ్దా) లో పడిపోయేవారు”. (19:58).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "నిజమే, ఈ ఖురాన్ దుఃఖంతో అవతరించింది. కాబట్టి, మీరు దానిని పఠించినప్పుడు, ఏడవండి. మీరు ఏడవలేకపోతే, అలా చేయడానికి తీవ్రంగా ప్రయత్నించండి. మరియు దానిని మధురంగా పఠించండి, ఎందుకంటే దానిని మధురంగా పఠించనివాడు మనలో ఒకడు కాదు " (ఇబ్న్ మాజా)
‘ఇమాం నవవి’ రహ్మతుల్లాహ్ అలైహి గారు ఇలా తెలిపారు: ఖురాన్ పఠించేటప్పుడు ఏడవడం అనేది, అల్లాహ్ తఆలా ను (మ'ఆరిఫా) గురించి లోతైన అవగాహన ఉన్నవారి లక్షణం మరియు ఇది అల్లాహ్ యొక్క పవిత్రమైన సేవకుల ప్రత్యేక లక్షణం.
ఓసారి ఉదయం ప్రార్థనలో ఉమర్ బిన్ అల్-ఖత్తాబ్ ఇమామ్ అయ్యి నమాజ్ చదివిపిస్తున్నప్పుడు, సూరహ్ యూసుఫ్ పఠించారు. ఆ సమయంలో వారి కన్నీళ్లు వారి చొక్కా పైకి ప్రవహించే వరకు ఆయన ఏడ్చారు. మరొక కథనంలో ఇది 'ఇషా' సమయంలో జరిగిందని పేర్కొనబడింది. ఇదంతా చూసి మనం ఇది పదేపదే జరిగిందని అంచనా వేయచ్చు. తన వెనుక వరుసలో ఉన్న 11 మంది అతని ఏడుపు వినే వరకు ఆయన గారు ఏడ్చారని మరొక కథనం పేర్కొంది.
‘ఇమామ్ అల్-గజాలీ’ రహ్మతుల్లాహ్ అలైహి ఇలా వ్రాశారు, "ఖురాన్ పఠించేటప్పుడు ఏడవడం ముస్తహబ్బ్ (సిఫార్సు చేయబడింది).
మనకు ఏడుపు రావాలంటే తీవ్రమైన బెదిరింపులు, హెచ్చరికలు మరియు వాగ్దానాలను ప్రతిబింబించడం ద్వారా హృదయంలో విచారాన్ని రేకెత్తించిన తరువాత, మనలో వాటికి సంబంధించి లోపాలను గుర్తించుకోవడం, లేకపోతే,ఇలా చేసిన తరువాత కూడా ఏడుపు రాకపోతే అతను తనకి ఏడుపు రావడం లేదని ఏడవాలి మరియు కేకలు వేయాలి.
నేను నా నఫ్సుతో (ఆత్మాతో ) ఇలా అన్నానుః "ఓ ఆత్మా!, నీవు అల్లాహ్ నుండి విన్నట్లుగా ఖురాన్ను పఠించు! ఇలా చెప్పగానే నేను (ఖురాన్ పఠించడం యొక్క) మాధుర్యాన్ని అనుభవించాను. -(సులేమాన్ బిన్ మేమూన్).
అల్లాహ్ ఎన్నుకున్న ప్రజలు
రంజాన్ అనేది మిగిలిన సంవత్సరానికి బూట్క్యాంప్(ఒక చిన్న, చాలా కష్టమైన శిక్షణా కార్యక్రమం). రంజాన్ తరువాత ఖురాన్ తో మన సంబంధాన్ని కొనసాగించాలనే ఉద్దేశం మరియు ప్రణాళికను చేద్దాం, తద్వారా మనం అల్లాహ్ యొక్క ఎన్నుకున్న ప్రజలవుతాము. మన ప్రియమైన ప్రవక్త (స) గారు ఇలా ప్రస్తావించారు, "మానవులలో అల్లాహ్ కు తన స్వంత ప్రజలు ఉన్నారు" అని అన్నారు. దీంతో తమ సహచరులు ఇలా అడిగారు, "ఓ ప్రవక్త, వారు ఎవరు? ఆయన ఇలా జవాబిచ్చారు, "వారు ఖుర్ఆన్ యొక్క ప్రజలు! అల్లాహ్ యొక్క ప్రజలు మరియు ఆయన ఎన్నుకున్న ప్రజలు". (ఇబ్న్ మాజా)
దేవదూతలు మీ ఇంటిని సులభంగా గుర్తించగలరా?
ఖురాన్ పరాయణంతో మీ ఇంటిని ప్రకాశవంతం చేయండి.
మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రస్తావించారు, ఏ ఇంట్లోనైతే ఖురాన్ పారాయణం జరుగుతుందో ఆ ఇల్లు స్వర్గం వాళ్లకి భూమిపై నివసించే వారిలో నక్షత్రాల్లా కనిపిస్తాయి."(బహకీ)


