ముహమ్మద్ రసూలుల్లాహ్: ఇస్లాం
Part-2
పైన మాట్లాడుకున్నట్లు, ఆ X అంటే ఇదీ, అనే చాలా సిద్ధాంతాలు, నమ్మకాలు వివిధ సమాజాల్లో వివిధ రకాలుగా చెలామణీలో ఉంటూ వస్తున్నాయి. మానవ మేధస్సు పెరిగే క్రమంలో, సృష్టి గురించి మనిషి పరి~గ్నానం పెరుగుతున్న కొద్దీ, ఆ X గురించి వాడుకలో ఉన్న అనేక సిద్ధాంతాలు కనుమరుగైపోతాయి. కొన్ని సిద్ధాంతాలని, కొన్ని ప్రాంతాల ప్రజలు కొన్ని తరాల పాటు నమ్మి,ఆచరించి ఉండొచ్చు. కొన్ని సిద్ధాంతాలు నిత్యం తమ రూపు మార్చుకుంటూనే మాది అత్యంత పురాతనమైన సిద్ధాంతం అని కూడా చెప్పుకుంటూ ఉండొచ్చు.
 
ఇలాంటి అనేక సిద్ధాంతాలలో ఇస్లాం కూడా ఒకటి. ఈ సిద్ధాంతాన్ని చెప్పింది మహమ్మద్ అనే ఓ వ్యక్తి. ఈయన 570 – 632 మధ్య, అరేబియా ఖండంలో జీవించారు. ప్రకృతి/సృష్టి,చరిత్ర, మనిషి శరీరం, చావు,పుట్టుకలు,మంచి-చెడు,స్త్రీ-పురుషుల సంబంధాలూ,పరిపాలన వంటి అనేక అంశాల గురించి, ఈయన చాలా విషయాలు చెప్పి ఉన్నారు. అవన్నీ ఖురాన్ గ్రంధం రూపంలో నిక్షిప్తం అయి ఉన్నాయి. వీటిలో చాలా వరకూ ఆయన ఆచరణలో చేసి చూపారు. ఆయన చేసినవీ, చెప్పినవీ ఏవీ, తన సొంత మేధస్సు ఆధారంగా కాదనీ, తనకు సృష్టికర్తనుండీ వచ్చిన సందేశం/ఆదేశం మేరకే తాను నడుచుకున్నాననీ ఆయన ప్రకటించారు. తన కంటే ముందు వచ్చిన, జీసస్, మోసెస్, అబ్రహాం వంటి వారిలాగే తాను కూడా కేవలం సృష్టికర్త ఎంచుకున్న ఓ మెసెంజర్ తప్ప, తనకు ఎలాంటి ప్రత్యేకతా లేదనీ, తనకు ఎలాంటి ప్రత్యేక శక్తులూ లేవనీ ఆయన స్పష్టంగా పదే,పదే చెప్పారు.
*********
“ఆయన జీవితం ఓ తెరిచిన పుస్తకం”- అనే ప్రావెర్బ్ మనం తరచూ వింటుంటాం. మహమ్మద్ ప్రవక్త జీవితం గురించి గత 1400 సంవత్సరాలుగా వచ్చినన్ని పుస్తకాలు,విశ్లేషణలు ఈ భూమిమీది మరే ఇతర మానవుడి గురించీ వచ్చి ఉండవు. ఆయన జీవితానికి సంబంధించిన ప్రతీ చిన్న విషయం కూడా గ్రంధస్తం చేయబడి ఉంది.ఇక, ఆయన ప్రవచించిన సిద్దాంతం ఖురాన్ రూపంలో, చిన్న అక్షరం కూడా మార్పు చెందకుండా యధాతధంగా ఉంది.
 
ప్రస్తుతం ప్రంచంలో అత్యధిక Surnameలలో ఉన్న పేరు ఆయనదే – ముహమ్మద్ అని. అట్లే, అత్యధిక మంది అత్యంత ఎక్కువగా ప్రేమించే మనుషుల్లో కూడా, ఆయనే అగ్రగణ్యుడిగా ఉంటారు. ( కేవలం ప్రేమించే మాత్రమే, పూజించే కాదు. ఎందుకంటే – ఏ ఒక్క ముస్లిం కూడా, పొరపాటున కూడా ఆయనను పూజించడు).
ఆయన గురించి సగమే తెలుసుకుని ఆయన్ని విపరీతంగా ద్వేషించేవారికి కూడా లెక్కలేదు. ఉదాహరణకు – ఆయన 13 మందిని పెళ్ళి చేసుకున్నారు కాబట్టి ఆయన్ని స్త్రీలోలుడిగా కొందరు చిత్రిస్తుంటారు. ఎక్కువ మంది స్త్రీల పొందు కోసం తపించే వారిని స్త్రీలోలుడనటం సమంజసంగానే అనిపించొచ్చు. కానీ, మహమ్మద్ ప్రవక్త పాతికేళ్ళ వయసులో, తనకంటే వయసులో 15 సంవత్సరాలు పెద్ద, మరియు అప్పటికే పెళ్ళై విధవరాలైన ఖదీజాను మొదటి వివాహం చేసుకున్నారని, ఆ తర్వాత పాతికేళ్ళ అన్యోన్య దాంపత్యంలో, ఖదీజా మరణించేంతవరకూ ఆయన రెండో పెళ్ళి చేసుకోలేదనే విషయం వీరికి తెలీదు. తెలిసినా తెలీనట్లు నటిస్తారు. ఆ తర్వాత ఆయన చేసుకున్న ప్రతి వివాహం వెనకా ముఖ్యంగా తెగల మధ్య బంధుత్వాలను కలుపుకొని యుద్ధాలను నివారించడం లాంటి సామాజిక ప్రయోజనాలే ఉన్నాయనే విషయం వీరి చెవికెక్కదు.
 
ఆయన హింసను ప్రేరేపించారని కొందరు విమర్శిస్తుంటారు. కానీ, ఆయన జీవితం మొత్తం తరచి చూస్తే, హింసను చిట్ట చివరి అంశంగా, గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే వాడారనీ, హింసను, యుద్ధాలను నివారించడానికి శాయశక్తులా ప్రయత్నించారని అనేక ముస్లిమేతర చారిత్రక పరిశోధకులే తీర్మాణించారు.
 
ఇవన్నీ , ఒక ఎత్తైతే, ఆయన ప్రవచించిన ఖురాన్ మరో ఎత్తు. పర్వతాలు,సముద్రాలు,భూమీ, ఆకాశం, నక్షత్రాలు,గర్భస్థపిండాలు లాంటి అనేక అంశాల గురించి 1400 సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి కొన్ని కామెంట్లు చేసి, వీటిలో ఏ ఒక్కటి తప్పని తేలినా, ఈ పుస్తకం మొత్తం సృష్టికర్త నుండీ రాలేదని నిరూపించబడినట్లే, చేతనైనోల్లు ఎవరైనా అలా ప్రూవ్ చేయండి అని సవాలు విసిరారు. ఈ 1400 సంవత్సరాలుగా కనుగొనబడిన ఆవిష్కరణలేవీ, ఖురాన్లోని ఏ ఒక్క వాక్యమూ తప్పని నిరూపించలేకపోయింది.
 
ఇక ఆయన మనిషి ఎలా ఉండాలని చెప్పాడనేది మరో ముఖ్యమైన అంశం. మనుషుల్లో వివిధ, స్థాయీబేధాలు ఉంటాయనో, తన అరబ్ జాతి ఉన్నత స్థాయి కాబట్టి, మిగతా మానవ జాతులందరూ ఓ అరబ్ వ్యక్తిని తమ ఇమాం గా పెట్టుకుని, ఆ అరేబియన్ కి అన్నీ సమర్పించేసుకోవాలనో ఆయన చెప్పలేదు. ఆయన చెప్పిందీ, ఆచరించి చూపిందీ ఒక్కటే – మనుషులందరూ సమానమే. ఏ ఒక్క మనిషికీ , మరో మనిషి పై ఆధిక్యత లేదు. ప్రతి మనిషీ, తాను చేసే ప్రతి పనికీ మరణానంతరం జవాబు చెప్పాల్సి ఉంటుందనే విషయం గుర్తెరిగి బాధ్యతతో మెలగండి.
 
తాను చెప్పిన దానిని నమ్మిన వారు నిష్టగా ఇస్లాం ని ఆచరించమని ఆయన చెప్పారే తప్ప, నమ్మని ముస్లిమేతరులని బలవంత పెట్టో,ప్రలోభపెట్టో ముస్లింలుగా మార్చమని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. నమ్మకం అనేది సొంత ఆలోచనలతోనే వస్తుంది తప్ప, బలవంతం ద్వారా వచ్చేది కాదని ఆయన స్పష్టంగా చెప్పి ఉన్నారు. అయినా ఇస్లాం ఖడ్గం ద్వారా వ్యాపించిందని కొందరు అడ్డగోలు వాదనలు వాదనలు చేస్తుంటారు. ప్రస్తుతం, ఈ భూమిమీద అత్యధిక ముస్లింలున్న దేశం ఇండోనేసియా. ఇక్కడ దాదాపు 20 కోట్ల పైబడే ముస్లింలు నివస్తిస్తున్నారు. కానీ, ఇండోనేషియాపైకి ఏ ముస్లిం రాజూ కత్తి పట్టుకుని యుద్ధానికి వెల్లలేదు. అది ఏనాడు ముస్లిం రాజుల ఏలుబడిలో లేదు. మరి అంత మంది ఎలా ముస్లింలుగా మారారు. బుర్రున్న ఇస్లామోఫోబ్ లు దీని గురించి ఆలోచించండి.
 
ఇస్లామోఫోబ్ లకు ఎప్పటికీ మింగుడు పడని మరో అంశం- మంగోలుల ఇస్లామీకరణ. తొలితరం మంగోల్ రాజులు ముస్లింలు కారు. పైగా వీరు అప్పటి ఇస్లామిక్ అగ్రరాజ్యలుగా వెలుగొందుతున్న ఇరాన్,సిరియా లపై దాడి చేసి వాటిని నేల మట్టం చేశారు. కొన్ని లక్షలమంది ముస్లింలను చంపేసి, మసీదులను, మదరసాలను కూల్చేశారు. సాక్షాత్తూ ముస్లింల మత నాయకుడైన ఖలీఫానే చంపేశారు. కానీ, తరువాతి తరం మంగోల్ రాజులు ఇస్లాం పట్ల ఆకర్షితులై ముస్లింలుగా మారారు. ఇది ఎలా సాధ్యం. రాజునూ-పేదనూ, గెలిచిన వారిని-ఓడిన వారినీ, ఉన్నోన్నీ-లేనోన్నీ అందరినీ ఆకర్షించే శక్తి ఇస్లాం కు ఉంది.
 
ఇవన్నీ చదివి,తెలుసుకుని – మానవ మాత్రుడెవరూ తన సొంత మేధస్సు ఆధారంగా ఇదంతా చేయలేడు/చెప్పలేడు అని నిర్ధారించుకుని, మహమ్మదుర్ రసూలిల్లా( మాహమ్మద్ దేవుని ప్రవక్తే ) అని నమ్మేవారు 100% ముస్లింలు.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter