కేరళలోని ఇస్లామిక విద్య దశను, దిశను మార్చిన సమస్త (మొదటి భాగం)

భారతీయ ముస్లింల పరిస్థితి విషయానికి వస్తే, వారు మైనారిటీ అయినప్పటికీ, తమ మత సిద్ధాంతాలను నిలబెట్టడానికి, అనుసరించడానికి మరియు ప్రచారం చేయడానికి పూర్తి స్వేచ్ఛను పొంది ముందుకు సాగుతారు. ఇంకా, వారు విభిన్న కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని ఉన్న అనేక సుస్థాపిత ఇస్లామిక సంస్థలు, సంఘాల నుండి ప్రయోజనం పొందుతారు. ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన సమస్తా కేరళ జమియ్యత్ అల్-ఉలమా (SKJU) (సాధారణంగా 'సమస్తా' అని పిలుస్తారు) గత శతాబ్దంగా కేరళ ముస్లింలకు మార్గనిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇది ఇస్లామిక విద్య, న్యాయశాస్త్రం విషయాలలో గణనీయమైన ప్రాముఖ్యతను సంపాదించుకొంది. ఫత్వాలు, ఇతర అనేక మతపరమైన, సామాజిక కార్యక్రమాలకు తన శాయశక్తులా కృషి చేస్తుంది. దీని శతాబ్ది జ్ఞాపకార్థంగా, ఈ సంస్థ తన శతవార్షికోత్సవ వేడుకలను జనవరి 28 న బెంగళూరులో ప్రారంభించనుంది.

జూన్ 26, 1926 న స్థాపించబడిన సమస్త, దక్షిణ భారతదేశంలో మతపరంగా అధికారంగా విస్తృతంగా పరిగణించబడింది. ఇది ముస్లింలు మరియు ముస్లిమేతరులచే గణనీయమైన ప్రభావాన్ని చవిచూసింది. ప్రధానంగా దక్షిణ భారతదేశంలోని ముస్లిం జనాభాకు మార్గనిర్దేశం చేస్తూ, కేరళలోని ఇస్లామిక విద్యా విప్లవంలో అగ్రగామిగా పేరు పొందింది.

దాని రాజ్యాంగంలో వివరించబడిన మూలంగా, సమస్త ఇస్లామిక సూత్రాలు మరియు గుర్తింపుకు అనుగుణంగా ఇస్లామిక మరియు మానవ శాస్త్రాల రెండింటిలోనూ విద్య యొక్క పురోగతికి స్థిరంగా ప్రాధాన్యతనిస్తుంది. సమస్త యొక్క కృషిని దీర్ఘంగా పరిశీలిస్తే, దాని మొదటి ఇరవై ఐదు సంవత్సరాలలో, ఆధునిక విద్య మరియు నకిలీ-ఆధ్యాత్మిక ఉద్యమాల ద్వారా వ్యాపించే వక్రీకరణల నుండి నిజమైన ఇస్లామిక బోధనలను రక్షించడంపై అది దృష్టి సారించింది. తరువాత, ఇది ఇస్లామిక విద్యను బలోపేతనం చేయడానికి ప్రాధాన్యతనిచ్చింది. ఏదైనా సమాజం మరియు దాని గుర్తింపు కి మూలస్తంభంగా జ్ఞానాన్ని గుర్తించింది.

ప్రస్తుతం, సమస్త యొక్క విద్యా పురోగతి ఆరు విభిన్న స్థాయిలలో విస్తృతమైన సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌లో నడుస్తుంది. ఇస్లామిక బోధనలు, మానవ శాస్త్రాలు మరియు వృత్తిపరమైన కోర్సుల సంగమంతో విద్యార్థులను మెరుగుపరచడానికి ఈ ఫ్రేమ్‌వర్క్ రూపొందించబడింది. ముందుగా  ప్రాథమిక మదర్సాలు ఉంటాయి, తరువాత రెండవ స్థాయిలో ఇస్లామిక వైజ్ఞానక కళాశాలలు ఉంటాయి. మరింత పురోగమిస్తూ, మూడవ స్థాయిలో ఇస్లామిక విజ్ఞానంలో పోస్ట్-గ్రాడ్యుయేట్ అధ్యయనాలను అందించే కళాశాలలను కలిగి ఉంటుంది. దానిని అనుసరించి, నాల్గవ శ్రేణిలో సమగ్ర విద్యను అందించే కళాశాలలు ఉన్నాయి. విభిన్న పాఠ్యాంశాల ద్వారా మానవ శాస్త్రాలతో జ్ఞానాన్ని మిళితం చేసింది.

ఇస్లామిక నేపథ్యంలో భౌతిక మరియు ప్రొఫెషనల్ కాలేజీలను కలిగి ఉన్న ఐదవ శ్రేణిని ప్రారంభించడం సమస్తాకు ఒక ప్రధాన మైలురాయి. ఉదాహరణకు MEA ఇంజనీరింగ్ కళాశాల, సమాజానికి ఉన్నత-నాణ్యత గల విద్యను అందించడం, సమగ్రత మరియు సామాజిక బాధ్యతతో నైపుణ్యం కలిగిన ఇంజనీర్‌లను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

సమస్త యాత్రలో అత్యంత ముఖ్యమైనది, 2023 లో సమస్త నేషనల్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ (SNEC) స్థాపన ఇటీవలి పురోగమనం. ఇస్లామిక విద్య మరియు నైపుణ్యం యొక్క దీర్ఘ ఐక్యతను ప్రోత్సహిస్తూ, ఇస్లామిక మరియు లౌకిక విషయాలలో పరిజ్ఞానం ఉన్న నిపుణులను పెంపొందించడానికి ఈ ముందుచూపు రూపొందించబడింది.

మద్రాసా ఉద్యమం

1945 నుండి, సమస్త విద్యా సాధికారత వైపు దృష్టి సారించింది. ప్రచురణలను పునరుజ్జీవింపజేయడం, మదర్సా ఉద్యమాన్ని ప్రారంభించడం, ఇస్లామిక విద్యా సంస్థలను స్థాపించడం మరియు దాని లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి విభిన్న సబ్‌కమిటీలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలకు నాయకత్వం వహించింది.

1951 లో, సమస్తా క్రమబద్ధమైన మరియు శాస్త్రీయంగా ఆధారితమైన మతపరమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా కేరళ ముస్లింల జీవితాల్లో గణనీయమైన మార్పును తెచ్చిపెట్టింది. ఈ మార్గదర్శక విధానం ఇస్లామిక సూత్రాలకు అనుగుణంగా ముందుకు సాగుతూనే ఇస్లామిక శాస్త్రాలలో శ్రేష్ఠతను ప్రోత్సహించడానికి ప్రయత్నించింది. ఈ వ్యవస్థ కాలానుగుణంగా అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి క్రమమైన అనుసరణలకు దారితీసింది. ప్రస్తుతం, సమస్తా పదివేల ఏడు వందల కంటే ఎక్కువ ప్రాథమిక విద్యాసంస్థలతో కూడిన విశాల ప్రభంజనం ఏర్పాటుచేసింది. వీటిని సాధారణంగా మదర్సాలుగా పిలుస్తారు. జూన్ 2021 నాటికి, ఈ సంస్థలు 1,118,534 మంది విద్యార్థులకు విద్యను అందించాయి. SKIMVB కార్యాలయంలో అధికారికంగా ముఅల్లిమ్ సర్వీస్ రిజిస్టర్ ద్వారా నమోదు చేయబడిన 95,874 మంది ఉపాధ్యాయులతో కూడిన అంకిత భావంతో కూడిన అధ్యాపకుల మద్దతుతో, ఈ మదర్సాలు ఇస్లామిక విద్యా రంగంలో ఒక దృఢ శక్తిని సూచిస్తాయి.

సమస్త ముస్లిం విద్యార్థుల కోసం నిరంతర ప్రయత్నాలతో కీలకమైన విద్యా బాటను తయారు చేసింది. మదర్సా విద్యతో ప్రాథమిక అధ్యయనాలకు పునాది ఏర్పడింది. ఈ విద్యాపరమైన ప్రక్రియ 12 వ తరగతి వరకు అమలులో ఉంటుంది. సాధారణ పాఠశాల వేళలు ప్రారంభమయ్యే ముందు ఉదయం 6 - 9 మధ్య తరగతులు జరుగును. స్కూలు సమయం సాధారణంగా 10 AM కి ప్రారంభమవుతుంది.

ఇంకా, బోర్డు యొక్క ప్రభావవంతమైన కార్యక్రమాలకు నిదర్శనంగా, తమిళనాడు, కర్ణాటక, లక్షద్వీప్, మహారాష్ట్ర, పాండిచ్చేరి మరియు అండమాన్ నికోబార్ దీవులలోని ఎంపిక చేసిన ప్రాంతాల నుండి వ్యక్తులు సమస్త మదర్సా పాఠ్యాంశాలను అంగీకరించారు. ఈ ప్రాంతాలలో మదరసాలను స్థాపించారు. అదనంగా, మలేషియా, UAE, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, ఖతర్ మరియు ఒమాన్‌లలో నివసిస్తున్న మలయాళం మాట్లాడే సంఘాలు ఒకే పాఠ్యాంశాలను స్వీకరించాయి మరియు సమస్త యొక్క సాధారణ పరీక్షలలో పాలుపంచుకుంటాయి.

దర్స్ మరియు ఇస్లామిక కళాశాలలు

భారతదేశంలోని కేరళలోని దర్స్ వ్యవస్థ శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో ప్రబలంగా ఉన్న సాంప్రదాయ ఇస్లామిక విద్యా విధానాన్ని సూచిస్తుంది. దర్స్ సంస్థలు తరచుగా మసీదులతో సంబంధం కలిగి ఉంటాయి మరియు మతపరమైన అభ్యాసం, ఇస్లామిక బోధనల వ్యాప్తికి కేంద్రాలుగా పనిచేస్తాయి. ఈ వ్యవస్థలో, విద్యార్థులు తమను తాము పూర్తిగా ముదర్రిస్ (ఉపాధ్యాయుడు) ఆధ్వర్యంలో ఇస్లామిక విద్యకు అంకితం చేస్తారు. వారు సాధారణంగా 6-10 సంవత్సరాలు తమ గురువుతో కలిసి చదువుతూ ఇస్లామిక పరిజ్ఞానంలో నిపుణులుగా మారతారు.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter